తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోల ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడమే కాదు.. వారి కుటుంబ సభ్యులను కలిసి తమ బిడ్డలను ఉద్యమ బాట విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.