తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.