ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఎంతో గొప్పగా సాగింది. అనుకోకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ కన్నుమూయడంతో రాజకీయంగా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ కి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయన వైఎస్ఆర్ సీపీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి వైఎస్ జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నవారిలో ఎంపి విజయసాయి రెడ్డి ఒకరు. ఈ పార్టీ తరుపు నుంచి ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు.
ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చార్టడ్ అకౌంట్ గా ఉన్న రాజకీయలపై మంచి అనుభవం ఉందని.. వైఎస్ఆర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనపై తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు సీఎం జగన్ కి న్యవాదాలు తెలిపారు.
It has been an honour raising issues relating to Andhra Pradesh’s welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022