కేబుల్ బ్రిడ్జి కుప్పకూలడంతో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా 78 మంది నీటిలో పడి మృతి చెందారు. ఈ విషాదక సంఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. మోర్బి నగరంలోని మచ్చు నదిపై బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించిన తీగల వంతెన ఆదివారం సాయంత్రం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి మీద ఉన్న వారు.. నదిలో పడి పోయారు. ఈ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా.. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. నదిలో గల్లంతయిన వారి జాడ ఇంకా తెలియలేదు. ఈ క్రమంలో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీపావళి సెలవులు, ఆదివారం కలసి రావడంతో.. వందలమంది పర్యాటకలు బ్రిడ్జి మీదకు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బ్రిడ్జి కుప్ప కూలిపోయింది.
ఈ బ్రిడ్జిని బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించారు. అతి పురాతనమైన కేబుల్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. అయితే మరమత్తుల నిమిత్తం ఆరు నెలల కిందట దీన్ని మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. అయితే గుజరాతీ నూతన సంవత్సరం, దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ 26న బ్రిడ్జిని తిరిగి తెరిచారు. ఇక ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు బ్రిడ్జి మీదకు చేరుకున్నారు. వందల మంది బ్రిడ్జి మీదకు చేరి నది అందాలను, పరిసరాలను గమనిస్తూ ఉండిపోయారు. అయితే వందల మంది పర్యాటకులు ఒకేసారి బ్రిడ్జి మీదకు చేరడంతో.. ఈ దారుణం చోటు చేసుకుంది. అధిక బరువు తాళలేక.. సాయంత్రం 6.30 గంటలకు వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దాంతో వంతెన మీద ఉన్న వందలాది మంది నదిలో పడి పోయారు. ఈ క్రమంలో నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట.. ఈత రాని వారు నదిలో మునిగి మృతి చెందారు. కొందరు బ్రిడ్జి తీగలను పట్టుకుని వేలాడుతూ.. కాపాడే వారి కోసం ఎదురు చూడసాగారు. ఇక బ్రిడ్జి మీద 400-500 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పలువురు స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా.. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat’s Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భుపేంద్రతో మాట్లాడి.. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కేంద్రం తరఫున 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడ్డవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక గుజరాత్ ప్రభుత్వం మృతులకు రూ.4 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు సీఎం భూపేంద్ర ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
— Narendra Modi (@narendramodi) October 30, 2022