నేషనల్ క్రైం- పెళ్లి.. జీవితంలో ఒక్కసారే జరిగే అరుదైన, అధ్బుతమైన ఘట్టం. సనాతన భారత దేశంలో వివాహా బంధానికి ఎంతో విలువ ఉంది. అందుకే భారత దేశ వివాహ వ్యవస్థను చూసి విదేశీయులు అచ్చేరువొందుకుంటారు. కానీ కొంత మంది దుర్మార్గులు పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. డబ్బులు, వ్యసనాల కోసం పెళ్లిని సైతం అపహాస్యం చేస్తున్నారు.
ఇదిగో ఇక్కడ ఓ ప్రబుధ్దుడు ఒకటి రెండు కాదు ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపరా జిల్లా పాట్కురా చెందిన ఓ వ్యక్తి 48 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 14 మందిని పెళ్లి చేసుకున్నాడు. సదరు వ్యక్తి 1982లో కొలిసారి వివాహం చేసుకోగా, 20 ఏళ్ల తర్వాత 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.
ఇదిగో ఈ క్రమంలో 2002 నుంచి 2020 మధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరోల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, ఒకరికి తెలియకుండా ఒకర్ని బుట్టలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో స్కూల్ టీచర్గా పనిచేసే చివరి భార్యతో కలిసి భువనేశ్వర్లో ఉంటున్నాడు, కాస్త ఆలస్యంగా అతడి నిజస్వరూపం తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ దుర్మార్గుడిపై చివరి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆమెను 2018లో పెళ్లి చేసుకుని, భువనేశ్వర్కు తీసుకొచ్చి, అక్కడే కాపురం పెట్టాడు. భర్త నంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండే మధ్యవయస్కులైన మహిళలను అతడు టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అందినంత డబ్బుతో ఉడాయించేవాడని పోలీసుల విచారణలో తేలింది.
తాను డాకర్ట్నని చెప్పుకుంటూ లాయర్లు, ఉన్నత విద్యావంతులు, ఫిజీషియన్లను బుట్టలో వేసుకున్నాడు. బాధిత మహిళల్లో ఒకరు సైనిక దళాల్లో పనిచేస్తుండటం చూసి పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, అసోం, ఝార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 14 మంది మహిళలు ఈ ప్రబుధ్దిడి చేతిలో మోసపోయారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువుర్ని మోసం చేయడం, హైదరాబాద్, ఎర్నాకులంలో బ్యాంకుల్లో రుణం ఎగవేత కేసుల్లోనూ గతంలో పోలీసులు రెండుసార్లు అరెస్ట్ చేశారు. మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తిని ఒడిశా పోలీసులు భువనేశ్వర్లో అరెస్ట్ చేశారు. బాధిత మహిళల్లో ఏడు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు.