‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్నారంటే ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ ఎనర్జీ చూసాక, పోకిరి రోజులను గుర్తుచేశాయని మహేష్ కూడా చెప్పడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. అందులోను మహేష్ సరసన కీర్తిసురేష్.. తమన్ సంగీతం.. ఇలా సర్కారు వారి పాటకు అన్నీ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూస్తే.. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని టాక్ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 58(అంచనా) కోట్ల వరకు వసూలైనట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా..
నైజాం (తెలంగాణ) – రూ.10.1 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) – రూ.2.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.11 కోట్లు
ఈస్ట్ – రూ.1.20 కోట్లు
వెస్ట్ – రూ.2.52 కోట్లు
గుంటూరు – రూ.1.91 కోట్లు
కృష్ణా – రూ.0.89 కోట్లు
నెల్లూరు – రూ.0.91 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో(ఏపీ+తెలంగాణ) – రూ. 25 కోట్లు(గ్రాస్- 35 కోట్లు)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – రూ.1.10 కోట్లు
ఓవర్సీస్ – రూ.7.85 కోట్లు
మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 58 కోట్ల గ్రాస్ ను, 38 కోయిట్ల షేర్ ను వసూలు చేసింది. మరి ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.