ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ వాడకం బాగా పెరిగిపోయింది.

ల్యాప్ టాప్ కొనాలి అంటే అంత తేలికైన విషయం కాదు.. చాలా ఖర్చు అవుతుంది.

అయితే ఇప్పుడు ప్రైమ్ బుక్ నుంచి అతి తక్కువ ధరలో ఒక ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.

అతి తక్కువ ధరలో అందరికీ ల్యాప్ టాప్ అందించాలనే ఉద్దేశంతో ప్రైమ్ బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్ ని మార్కెట్ లో రిలీజ్ చేశారు.

ఇందులో విండోస్ పని చేయదు. ఈ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది.

ఈ ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ 4జీ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది.

10 వేల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్స్ ని ఈ ల్యాప్ టాప్ సపోర్ట్ చేస్తుంది. 

దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 11.6 ఇంచెస్ హెచ్ డీ రెజల్యూషన్ కలిగిన ఎల్ సీడీ డిస్ ప్లేతో వస్తోంది.

మీరు ఈ ల్యాప్ టాప్ స్టోరేజ్ ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 200 జీబీ వరకు పెంచుకోవచ్చు.

దీనిలో వైఫై, యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.

ఇందులో 2 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఈ ప్రైమ్ బుక్ ల్యాప్ టాప్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి బేస్ వేరియంట్ కాగా.. రెండోది టాప్ వేరియంట్.

ఈ బేస్ వేరియంట్ ల్యాప్ టాప్ ధర రూ.16,990గా నిర్ణయించారు. 

4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ల్యాప్ టాప్ ధర రూ.18,990గా నిర్ణయించారు. 

ఈ ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ మార్చి 11 నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులోకి రానుంది.