గత ఏడాది యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 8 రోజుల పాటు.. 12 మంది మధ్యవయస్కుల మీద ఈ నీటి ఉపవాసం ప్రయోగాన్ని నిర్వహించారు.
ఎనిమిది రోజుల తర్వాత వారిలో బరువు తగ్గడం, సీరం గ్లూకోజ్ గాఢత తగ్గడం, ఒత్తిడి తగ్గడం, నిర్జలీకరణం, పెరిగిన కెటోజెనిసిస్, హైపర్యూరిసెమియా, హైపోనాట్రేమియా వంటి స్థాయిలు చాలా ఎక్కువగా తగ్గాయని గుర్తించారు.
అయితే ఈ ఉపవాసం వల్ల శరీరంపై కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నాయని.. కానీ అలా అని చెప్పి ఎక్కువ కాలం ఈ ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అధ్యయనం అంచనా వేసింది.
ఇలాంటి ప్రయోగాల బదులు.. మన శరీరానికి సరిపడా పోషకాహారం తీసుకుంటూ.. వ్యాయామం చేయడం ఉత్తమం అంటున్నారు.
నీటి ఉపవాసం వల్ల తక్షణం కలిగే ప్రయోజనాల కన్నా.. దీర్ఘకాలంలో కలిగే నష్టాలే అధికంగా ఉన్నాయి.