నిరుద్యోగులకు బీహార్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
లక్షా 78 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో ఏ రాష్ట్రం వారైనా ఈ టీచర్ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో అక్కడ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టులకు స్థానికంగా ఉన్న వారినే తీసుకునేవారు.
అయితే ఇప్పుడు బయట రాష్ట్రాల వారిని కూడా తీసుకోవాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా సరే ఈ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్కూళ్లలో మొత్తం 1,78,026 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
85,477 ప్రైమరీ టీచర్లు, 1745 మాధ్యమిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయసు పరిమితి: 1 నుంచి 5వ తరగతి టీచర్లకు: 18 ఏళ్ళు 9, 10వ తరగతి, 11, 12వ తరగతి టీచర్లకు: 21 ఏళ్ళు అన్ రిజర్వ్డ్ పురుష అభ్యర్థులకు: 37 ఏళ్ళు అన్ రిజర్వ్డ్ మహిళా అభ్యర్థులకు: 40 ఏళ్ళు బీసీ,ఈబీసీ, పురుష, మహిళా అభ్యర్థులకు: 40 ఏళ్ళు ఎస్సీ, ఎస్టీ, పురుష, మహిళా అభ్యర్థులకు: 42 ఏళ్ళు
జీతభత్యాలు: ప్రైమరీ టీచర్ (1-5వ తరగతి) మూల వేతనం: రూ. 25 వేలు సెకండరీ టీచర్ (9-10వ తరగతి) మూల వేతనం: రూ. 31 వేలు 11వ, 12వ తరగతి టీచర్ మూల వేతనం: రూ. 32 వేలు
ఇతర వివరాలు: ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్షల తేదీ: ఆగస్టు 24 నుంచి ఆగస్టు 27 వరకూ దరఖాస్తు చివరి తేదీ: 12/07/2023
పరీక్ష ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 750/- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 200/- మహిళలకు: రూ. 200/-