టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం లభించింది. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి ప్రతిష్టాత్మక విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు ఎంపికయ్యారు.
లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2022 ఎడిషన్ అవార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్కు దక్కింది.
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్లో సత్తా చాటినందుకు గాను రోహిత్ శర్మ, బుమ్రాలను ఆయా అవార్డులకు ఎంపిక చేసినట్లు బ్రూత్ పేర్కొన్నాడు.
ఆ సిరీస్ భారత్ సాధించిన రెండు విజయాల్లో రోహిత్ది ముఖ్యపాత్ర అని, లార్డ్స్ టెస్ట్లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని బ్రూత్ కితాబునిచ్చాడు.
ఇంగ్లండ్తో సిరీస్లో రోహిత్ 4 టెస్ట్ల్లో 368 పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు.
కాగా, 5 టెస్ట్ల ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా, కోవిడ్ కారణంగా చివరి టెస్ట్ ఇంకా జరగాల్సి ఉంది.
కాగా.. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు విరాట్ కోహ్లీ ఎంపిక కాకపోవడంపై అతని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.